Wednesday, May 1, 2024

ఆ పత్రాలను ఎందుకు తగలబెట్టారో డిజిపి చెప్పాలి: వర్ల రామయ్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారో డిజిపి చెప్పాలని టిడిపి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాలు దహనం చేశారని, తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదని రామయ్య హెచ్చరించారు. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో పలు కాగితాలను సిబ్బంది దహనం చేశారు. సిట్ కార్యాలయ సిబ్బంది పలు పత్రాలు దహనం చేయడంపై అనుమానాలు ఉన్నాయని టిడిపి వాళ్లు ఆరోపణలు చేశారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కాగితాలే తగలబెట్టి ఉంటారని టిడిపి వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News