- Advertisement -
న్యూఢిల్లీ : కోచ్, స్లీపర్తో ప్రీమియం బస్ శ్రేణిని విఇ కమర్షియల్ వెహికల్స్(విఇసివి) ఆవిష్కరించింది. నూతన కోచ్, స్లీప ర్ ప్లాట్ ఫామ్తో ఇంటర్ -సిటీ లగ్జరీ బస్సు ప్రయాణంలో కొత్త ప్రమాణాలను ఐషర్, వోల్వో గ్రూప్ జాయింట్ వెంచర్ విఇసివి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి, సిఇఒ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతీయ బస్సు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రూపం ఇవ్వాలన్న లక్ష్యంతో విఇసివిలో బస్ డివిజన్ ఏర్పాటును ఏడాది క్రితం ప్రకటించామని అన్నారు. నూతన శ్రేణి ఆవిష్కారాన్ని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నామని, నిజం గా ఈ ఉత్పాదన అత్యుత్తమంగా ఉంటుందని అన్నారు.
- Advertisement -