Friday, April 26, 2024

వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ‘మా బావ మనోభావాలు’

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి పాట బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు, ఆల్బమ్ లోని ప్రత్యేక పాట కోసం సమయం వచ్చింది. మేకర్స్ ఇప్పటికే దీనిని ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అని పిలవడం ద్వారా తమన్ మన కోసం ఎలాంటి పాటని లోడ్ చేశాడనే క్యూరీయాసిటీ పెంచేసింది. ఈ పాటని డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ బ్లాక్ బ్లేజర్, కూల్ సన్ గ్లాసెస్‌ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ పాటకు ‘మా బావ మనోభవాలు’ అనే క్యాచి పేరుని పెట్టారు. బాలయ్య రాకింగ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ అంచనాలు మరో స్థాయికి పెంచింది.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News