ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్లో అత్యధికంగా క్రేజ్ ఉందంటూ మరోసారి నిరూపితమైంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ జాబితాలో విజయ్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఆన్లైన్ ద్వారా ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. 2018లో కూడా ఈ యంగ్ స్టార్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. 2018 సంవత్సరంలో బ్లాక్బస్టర్ మూవీస్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల వల్ల విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మెన్గా నిలిచి ఉంటాడని అనుకున్నారు. కానీ ఈసారి ఆయనకు ఛాన్స్ లేదని కొందరు భావించారు.
వరుసగా అతని సినిమాలు నిరాశపరుస్తున్న నేపథ్యంలో ఈ రౌడీ స్టార్ క్రేజ్ తగ్గుతోందని.. స్టార్డమ్ పడిపోతుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ కామెంట్స్ అన్నింటికీ కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్గా మళ్లీ ప్రథమ స్థానంలో నిలవడంతో రౌడీ స్టార్ సమాధానం ఇచ్చినట్లయ్యింది. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో రామ్ పోతినేని, ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్కు నాలుగవ స్థానం దక్కడం ఆశ్చర్యంగా ఉంది. 2018 సంవత్సరానికి గాను ఈ జాబితాలో నం.2గా ప్రభాస్ నిలిచాడు. ఈసారి రెండు స్థానాలు కోల్పోయి 4వ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్లు నిలవడం చెప్పుకోదగ్గ విషయం.