Tuesday, May 7, 2024

ప్రాణాలైనా తీసుకుంటాం..ఇథనాల్‌ ఫ్యాక్టరీ కట్టనివ్వం

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: రోజు రోజుకూ మరింత ముదురుతూ రగులుతున్న ఇథనాల్ ఫ్యాకటరీ లోల్లి . శుక్రవారం మండలం లోని స్తంభంపల్లి గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ చల్లూరి రూప రాంచంద్రం ఆద్వర్యం లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రాంతం లో ఉన్న సాయిబాబ గుడిలో కొబ్బరి కాయలు కొట్టి ఫ్యాక్టరీ నిర్మాణం ను నిలిపి వేసేలా దీవించు బాబా అంటు మొక్కులు చెల్లించుకున్నారు.

గురుపౌర్ణమి కావడం తో గ్రామం లోని మహిళలు ముకుమ్మడి గా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ఎస్సై నరేష్ కుమార్ ఆద్వర్యం లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అపివేయాలని లేని చో ఉద్యమం ఉదృతం చేస్తామని ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ హెచ్చరిస్తున్నారు. ప్రాణాలైనా తీసుకుంటాం..ఇథనాల్‌ ఫ్యాక్టరీ కట్టనివ్వం గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News