Monday, April 29, 2024

బస్సులో పోగొట్టుకున్న డబ్బు.. బాధితులకు అందజేసిన ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ : బస్సులో పోగొట్టుకున్న డబ్బును సీసీ కెమెరాలతో సహాయంతో గుర్తించి తిరిగి బాధితులకు డబ్బును అప్పజేసినట్లు నారాయణఖేడ్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్‌ఐ మాట్లాడుతూ… అల్లాదుర్గం మండలం బైరాన్‌దిబ్బకు చెందిన మడపతి సంగీత తన తల్లిగారైన గ్రామానికి వెళ్లడానికి ఖేడ్‌లో బస్సు దిగే హడావిడిలో రూ.40వేల నగదు ఉన్న బ్యాగును మరిచిపోయిందని తెలిపారు.

వెంటనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తెలియజేయడంతో సీసీ కెమెరాల ద్వారా బస్సును గుర్తించి బస్సులో ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని డబ్బును బాధితులకు అప్పచెప్పామని ఎస్‌ఐ వెల్లడించారు. సీసీ కెమెరాలు లేకపోతే బాధితులు నష్టపోయేవారని, కావున షాపింగ్ మాల్స్, దుకాణాల సముదాయాలు, కాలనీల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News