హైదరాబాద్: విశాఖలో విషవాయువు లీకై ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. మరో 400మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలు జంతువులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటనపై ట్వీట్టర్ స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. విషవాయువు కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సిఎం జగన్ వెంటనే ఆస్పత్రికి చేరుకొని బాధితుల కుంటుంబాలను పరామర్శించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.25 లక్షల పరిహారాన్ని సిఎం జగన్ ప్రకటించారు.
Virat Kohli, Sania Mirza Responds on gas leakage in Vizag