Monday, April 29, 2024

పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: సబితా

- Advertisement -
- Advertisement -

Tenth

 

హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ పకడ్బందీ చర్యలు చేపట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైతుందన్నారు.  గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచామని, పేపర్ వాల్యుయేషన్‌కు వచ్చే లెక్చరర్స్‌కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు. జూన్ రెండో వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు నిలిపివేశామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో మళ్లీ పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబితా ధైర్యం చెప్పారు. హైకోర్టు అనుమతి రాగానే వారికి అన్ని వసతులు కల్పించి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నామని సబితా పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దన్నారు. నెలవారిగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని సబితా హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పలు పాఠశాలలపై చర్యలు తీసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News