- Advertisement -
హైదరాబాద్: దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా విడుదలను చిత్రయూనిట్ వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 30న విడుదల కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ‘లవ్స్టోరీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు వాయిదా పడ్డాయి. వీటితోపాటు టాలీవుడ్ బడా సినిమాలు కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
Virata Parvam movie release date postponed
- Advertisement -