- Advertisement -
ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.499 నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 1.5 జిబి డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా జి5 యాప్కు కస్టమర్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ సర్కిల్ని బట్టి 60 నుంచి 70 రోజుల వరకు వస్తోందని సంస్థ నిర్ణయించింది. అటు రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్కు వొడాఫోన్ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్కు 70 రోజుల వాలిడిటీ ఉండగా.. దానిని సవరించి 77 రోజులకు పెంచింది. ఇందులో రోజుకు 1.5 జిబి డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వినియోగదారులు పొందవచ్చు.
Vodafone introduces Rs 499 prepaid plan
- Advertisement -