Saturday, May 11, 2024

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు

- Advertisement -
- Advertisement -

Walking is very good for health

మనతెలంగాణ/బోయిన్ పల్లి: నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాధికా అమృత్ మహోత్సవం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే మినీ మారథాన్ రన్ ఆదివారంమడ్ ఫోర్డ్ మైదానంలో నిర్వహించిన రన్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్ హాజరై సీఈఓ అజిత్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభిచారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మినీ మారథాన్ సిఖ్ విల్లాజె, తాడు బండ్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది.

మినీ మారథాన్ కు విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతలోని పలువురు క్రీడాకారులు సీనియర్ ఆతెలిట్స్ పాల్గొన్నారు.క్రీడాకారులకు జోష్ నింపటం కోసం మంచి సంగీతం ఏర్పాటు చేసి అందరిలో జోష్ నింపారు. సంగీతానికి అనుగుణంగా యువత నృతయాలు చేశారు. అనంతరం విజేతలుగా బహుమ తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు ముకేశ్, సీనియర్ ఆతెలిట్స్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మాజీ బోర్డ్ ఉపదక్షుడు జంపన ప్రతాప్,మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, నివేదిత, మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్, బోర్డ్ అధికారులు దేవేందర్ ,మహేందర్, పరిశురాం, ఇంజనీర్ రాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News