Wednesday, May 15, 2024

బావి కనిపించడంలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు….

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ రైతు తన పొలంలో బావి మాయమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి మండలం మావినహోండ ప్రాంతంలో జరిగింది. మావినహోండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతుకు బావి తవ్వడం కోసం రుణం తీసుకొని చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. దీంతో రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కుమారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో బావి కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆరా తీయగా రైతు పేరు మీద బావి తీసినట్టుగా నిధులను ప్రభుత్వ అధికారులు కాజేసినట్టు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News