Tuesday, April 30, 2024

ఇది ఎంతో భయంకరమైన సంవత్సరం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ktr

హైదరాబాద్: ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషవాయువు లీకేజీ కారణంగా మృతిచెందిన కుటుంబసభ్యులకు కెటిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన 8మంతి ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.

 

What a Horrible Year this has Been Says KTR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News