Monday, May 6, 2024

మద్యం మత్తులో భర్తను హత్యచేసిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife Killed Her Husband in Chandrayangutta

చాంద్రాయణగుట్ట : మద్యం మత్తులో భర్తను హత్యచేసిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా గల దుకాణాల ముందు ఒక వ్యక్తి ముఖం కాలిపోయి, గొంతుకు చున్నీ బిగించి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పక్క రాష్ట్రం కడప జిల్లాకు చెందిన మహ్మద్ సోహెల్ (31), రేష్మా (28) భార్యాభర్తలు, వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత మూడు నెలలుగా స్థానిక ఫుట్‌పాత్‌పై నివసిస్తూ భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో మద్యం, కళ్లు సేవిస్తుంటారు. ఆ తరువాత భార్యాభర్తలు గొడవపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మద్యం సేవించి గొడవ పడ్డారు. తాగిన మత్తులో భార్య రేష్మా భర్త సోహెల్ ముఖంపై మద్యం పోసి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు వేసి నిప్పు పెట్టింది. ఆ మంటలను తట్టుకోలేక సోహెల్ కేకలు వేయటంతో చున్నీతో గొంతును బిగించింది. దీంతో సోహెల్ ఊపిరి ఆడక చనిపోయాడు. పోలీసుల విచారణలో భర్తను హత్యచేసిన విషయాన్ని అంగీకరించింది. సోహెల్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. భార్య రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Wife Killed Her Husband in Chandrayangutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News