Sunday, April 28, 2024

వచ్చేనెల 7న బాధ్యతలు చేపడతా: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పిసిపి అధ్యక్షుడిగా జులై 7న బాధ్యతలు చేపడతానని ఎంపి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, అందరం కలిసి ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం మేరకే ముందుకు వెళతామనిచ జులై 7వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని రేవంత్ వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి బలహీనంగా ఉందని, ఆ పార్టీ ప్రభావం రాష్ట్రంలో తక్కువేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుంటామని రేవంత్ స్పష్టం చేశారు.

Will take charge as TPCC Chief on July 7th: Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News