- Advertisement -
హైదరాబాద్: ఏడాది పాపతో సహా ఓ తల్లి నాలుగో అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన నగరంలోని రామంతాపూర్ శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను గాంధీఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -