- Advertisement -
లక్నో: ప్రభుత్వ స్కూల్ లో టీచర్ను సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆరాధన రాయ్ అనే మహిళ, అమిత్ కౌశల్ అనే వ్యక్తి ప్రభుత్వ స్కూల్ లో పని చేస్తున్నారు. సెలవుల విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అమిత్ గన్ తీసి ఆమె తలపై రెండు సార్లు కాల్చాడు. ఘటనా స్థలంలో టీచర్ చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎస్పి ఆర్పి సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించాడు. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -