- Advertisement -
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని కాలిపోతున్న భార్యను ఫోన్ లో వీడియో తీసి ఆమె తల్లిదండ్రులకు భర్త పంపాడు. గుధాగోర్జి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవంబర్ 20న అత్తగారింటి వేధింపులు తట్టుకోలేక భార్య కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. భార్య కాలిపోతుండగా కాపాడాల్సిన భర్త ఫోన్లో వీడియో తీసి ఆమె తల్లిదండ్రులకు పంపించాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 22న ఆమె చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్త తల్లిదండ్రులను, భర్త తమ్ముడిని, భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీస్ అధికారి దేహ్రీ సింగ్ తెలిపాడు.
- Advertisement -