ముంబయి: హత్యాయత్నం కేసులో విచారిస్తుండగా ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అజిత్ ఓంబాసే అనే వ్యక్తిని ఓ వ్యక్తి, నలుగురితో కలిసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. హత్యయత్నం విఫలం కావడంతో అజిత్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుల వద్ద నుంచి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అజిత్ ఒంబాస్కే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో ఆమె భర్తే అతడిని చంపడానికి ప్రయత్నించాడని నిందితులలో ఒకడు తెలిపాడు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె భర్త, ఆమె సోదరులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పోలీసులు తీసుకవచ్చారు. మహిళను విచారిస్తుండగా మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లింది. బాత్రూమ్లో చేతి నరాన్ని కోసుకొని అందులోని ఉండిపోయింది. బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో మహిళ కానిస్టేబుల్ వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -