Tuesday, May 7, 2024

మహిళ మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలి పరారైన ఇద్దరు వ్యక్తులు

- Advertisement -
- Advertisement -

Woman's body was left in Hospital by two men and run away

 

మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: గుర్తు తెలియని ఓ మహిళ మృత దేహాన్ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వదిలి పరారైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. శుక్రవారం రాత్రి 10:30 సమయంలో ఇద్ద రు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోలో ఓ గుర్తు తెలియని మహిళ (25) ను తీసుకవచ్చి సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాంటి వివరాలు ఇవ్వకుండా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే మృతురాలి ఎడమ చేతిలో లక్ష్మీ అని పచ్చబోట్టు ఉండగా కుడివైపున ఎం. అని ఉందని, ఎలాంటి వివరాలు తెలియక పోవడంతో సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News