Saturday, May 4, 2024

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతుల అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Disappearance of two Young women in separate incident

 

మన తెలంగాణ/ జగద్గిరిగుట్ట: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎల్లమ్మబండకు చెందిన శీలం ఉమారాణి (29)తో డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఈ నెల 14న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒకటిన్నర సంవత్సరాలు కలిగిన తన పాప సంహీతను తీసుకుని వెళ్ళిపోయి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చూట్టు పక్కల, బంధువుల వద్ద ఆరా తీసిన ఆచూకి లభించలేదు. భర్త యర్లగడ్డ శ్రీకిరణ్ జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో సంఘటనలో …

హనుమాన్‌నగర్‌కు చెందిన పుల్లయ్య కూతురు ఐశ్వర్య (21) శనివారం మధ్యాహ్నం సుమారు 12ః30 సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం చుట్టూ పక్కల, బంధవుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి పోచయ్య జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి శంకర్ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News