Friday, May 10, 2024

పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఛండీఘఢ్ : పట్టాల మధ్య పడుకొని తన ప్రాణాలు ఓ మహిళ కాపాడుకున్న సంఘటన హర్యానాలోని ఛండీఘఢ్ లో జరిగింది.  పట్టాలపై గూడ్స్ రైలు ఉండడంతో రైలు కింది నుంచి స్థానికులు అటు ఇటు దాటుతున్నారు. ఓ మహిళ రైలు కిందకు వెళ్లినప్పుడు అది కదలడం ప్రారంభించింది. దీంతో రెండు పట్టాల మధ్య పడుకుంది. అక్కడ ఉన్న వారు ఆమెను అలానే పడుకోవాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఆమె ప్రాణం పోయేది. ఎక్కడ కూడా ఆమె కదలలేదు కాబట్టి ప్రాణాలతో బయటపడింది. ఓ వ్యక్తి తన మొబైల్ లో వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో ఫోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలివిగా తన ప్రాణాలను మహిళ కాపాడుకుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News