Sunday, April 28, 2024

యువకుడి ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

Young Man killed by Girl Family At Kurnool District

అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండంమెట్ట మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. రుద్రవరం మండంలో పేరూరులో ప్రేమజంట పరారైంది. ప్రేమ జంటకు సహకరించాడని ప్రవీణ్ అనే యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News