- Advertisement -
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలను భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….కెపిహెచ్బిలోని రెండో ఫేజులో ఉంటున్న శాంతి(26) మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్లో ఇంజనీర్గా పనిచేస్తోంది. శాంతి గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలు, తలనొప్పితో బాధపడుతోంది. రోజు రోజుకు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో భరించలేక శాంతి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు శాంతి సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -