Monday, May 6, 2024

నా భవిష్యత్తు తెలంగాణ లోనే.. : షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా మీడియా చానళ్లలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారన్న వార్తలు కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డ గా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు విఫల యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘నా భవిష్యత్తు తెలంగాణలోనే నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ‘ అని పోస్టు పెట్టారు. అయితే పార్టీ విలీనం ఒట్టి మాటే అని గానీ, పార్టీని కొనసాగిస్తానని గానీ షర్మిల తన పోస్టులో ఎక్కడా పేర్కొన లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News