Saturday, April 27, 2024

అగ్రిచట్టాలపై నిరసనగా రాజస్థాన్ బిల్లు

- Advertisement -
- Advertisement -

Rajasthan Bill in protest against agri-laws

 

జైపూర్ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ అసెంబ్లీలో బిల్లు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తెలిపారు. పంజాబ్‌లో తీసుకువచ్చినట్లుగానే తమ రాష్ట్రం కూడా స్పందిస్తుందన్నారు. కేంద్ర అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ నాయకత్వపు రాష్ట్రమే అయిన రాజస్థాన్ కూడా తాము ఈ పద్ధతినే అనుసరిస్తామని తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు తీసుకువస్తున్నట్లు గెహ్లోట్ ట్వీటు వెలువరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతాంగ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో ప్రతిఘటిస్తూనే ఉంటామని , అన్నదాతల వైపున తాము నిలిచి ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News