Wednesday, May 15, 2024

ఆంధ్రాలోని ఫార్మా యూనిట్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం!

- Advertisement -
- Advertisement -
Modi
ఆంధ్రప్రదేశ్‌లోని కెమికల్ యూనిట్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కెమికల్ యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సంతాపం తెలిపారు. ఈరోజు జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

“ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో కెమికల్ యూనిట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను: PM @narendramodi” అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

ఈ ఘటన తర్వాత గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించి మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించండంతో పాటు ఘటనకు కారణమైన కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కూడా జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News