Friday, May 3, 2024

ఏడాది జైలు శిక్ష అనుభవించిన తొమ్మిది మేకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్త పుణ్యానికి మేకలు ఏడాదికి పైగా జైలు శిక్షఅనుభవించాయి. ఈ ఘటనా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. బంగ్లాదేశ్ దేశంలో 2022 డిసెంబర్‌ 6న షహరియార్‌ సచిబ్‌ రాజీబ్‌ అనే వ్యక్తికి చెందిన తొమ్మిది మేకలు స్థానిక శ్మశాన వాటికలో మేపాడు. చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అధికారులు తొమ్మిది మేకలను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్‌ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉన్నాయి. తన మేకలను విడిపించుకునేందుకు వాటి యజమాని పలు విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.. ఏడాది జైలుశిక్ష అనంతరం స్థానిక మేయర్ చొరవతో ఇటీవలే ఆ మేకలు విడుదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News