Tuesday, April 30, 2024

పకడ్బందీగా ‘కౌంటింగ్’

- Advertisement -
- Advertisement -

రేపే ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు సిద్ధం

హైదరాబాద్‌లో అత్యధికంగా 14 కౌంటింగ్ కేంద్రాలు

సిఆర్‌పిఎఫ్ బలగాలతో మూడంచెల భద్రత
ముందుగా పోస్టల్ బ్యాలెట్, తరువాత ఇవిఎంల కౌంటింగ్

ఉ. 10.30 గంటలకు తొలి రౌండ్ ఫలితం
ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేదు
71.7% పోలింగ్ నమోదు

2018 ఎన్నికలతో పోల్చితే ఈసారి 2.05% తక్కువ నమోదు : సిఇఒ వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం గా పూర్తి కావడంతో కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రా లు సిద్ధ్దం చేసినట్లుగా శుక్రవారం మీడి యా సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో 1766 లెక్కిం పు టేబుళ్లు , 131 పోస్టల్ బ్యా లెట్ టేబుళ్లు ఏర్పాట్లు చేసిన ట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో 40 కంపెనీల బలగాలు పహారా కా స్తున్నట్లు, స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ముం దుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, తరువాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెం ట్లు ఉంటారన్నారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10.30 గంటల వరకు మొ దటి రౌండ్ ఫలితం వెలువడుతుందన్నారు.

తెలంగాణలో ఎక్కడ రీపోలింగ్ కు అవకాశం లేదని, పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్, మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 శాతం నమోదైనట్లు చెప్పారు. ఈసారి గత ఎన్నికల కంటే పోలింగ్ 2.05 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో పురు ష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని  వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 79 ని యోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందన్నారు. రా ష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారు. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని థర్డ్ జెండర్ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేసినట్లు తెలిపారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సిసి టివి సదుపాయం కల్పించామన్నారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయని , 2018లో 2400 కేసులు అయితే, ఇప్పడు 13వేల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 49 లెక్కింపు కేంద్రాలు…
రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు సిద్ధ్దం చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశామని, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్దం చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో…
ముషీరాబాద్ ఏవీ కళాశాల దోమల్ గూడ, మలక్ పేట ఇండోర్ స్టేడియం, అంబర్ పేట రెడ్డి ఉమెన్స్ కళాశాల నారాయణగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ, సనత్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ఓయూ, నాంపల్లి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ మాసబ్ ట్యాంక్, కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసబ్ ట్యాంక్, గోషామహల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోఠి, చార్మినార్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల నాంపల్లి, చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల బషీర్ బాగ్, యాకత్ పురా సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ నాంపల్లి , బహదూర్ పురా అరోరా కళాశాల బండ్లగూడ, సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓయూ, కంటోన్మెంట్ వెస్లీ కళాశాల సికింద్రాబాద్.
రంగారెడ్డి జిల్లాలో…
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి.

CEO Vikas Raj

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News