- Advertisement -
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ను సిపి మహేష్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. మల్కాజ్గిరి డిసిపి కార్యాయలంలో ఉన్న పాత క్వార్టర్స్ను రినోవేషన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని డైనింగ్ హాల్, క్యాంటీన్, ఎస్బి ఆఫీస్, డ్రైవర్ల రెస్టు రూములుగా వినియోగించనున్నారు. ఎస్టేట్ ఆఫీసర్ విజయాగనంద్ కృషి వల్లే రినోవేషన్ పనులు త్వరగా పూర్తయ్యాయని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రినోవేషన్కు దాదాపుగా రూ.20లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, డిసిపి క్రైం యాదగిరి, ఎడిసిపి శిల్పవల్లి, సయిద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -