Monday, April 29, 2024

భార్యపై అనుమానంతో శిరచ్ఛేదం

- Advertisement -
- Advertisement -

Man Beheads Wife After Argument at Uttar Pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఉదయం మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని బండాలో ఒక వ్యక్తి తన భార్యను అనుమానించి శిరచ్ఛేదం చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు- చిన్నార్ యాదవ్ తన భార్య విమల (35)తో ఈ ఉదయం 7:30 గంటలకు నేతానగర్ ప్రాంతంలోని వారి ఇంట్లో గొడవ పడ్డాడు.

“కోపంతో, చిన్నార్ యాదవ్ తన భార్య తలను పదునైన ఆయుధంతో నరికాడు, ఆ తరువాత ఆమె తలను బాబేరు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి అక్కడ లొంగిపోయాడు” అని పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ చెప్పారు. భీతావహంగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని చిన్నార్ యాదవ్‌ను అరెస్టు చేసి, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గతంలోనూ యుపిలో ఇలాంటి ఘటనలు కలకలం రేపాయి. మనుషుల్లో పెరుగుతున్న క్రూరత్వానికి ఇవి ఆనవాళ్లని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News