Saturday, May 4, 2024

రాజ‌స్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

జైపూర్‌: బ‌ర్మేర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌ర్మేర్‌-జోద్ పూర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ ఆయిల్ ట్యాంక‌ర్ 25మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బ‌స్సును ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంక‌ర్ నుంచి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగి బస్సులోకి వ్యాపించాయి. బస్సు ముందు భాగం సగం వరకు భారీ మంటలు అలుముకోవడంతో 12మంది ప్ర‌యాణికులు సజీవదహనం అయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

10 died in Road accident in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News