అమరావతిః ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో మరో 15మంది మరణించారని తెలపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 22,259కు చేరుకుంది. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 264మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల్లో ఎపికి చెందిన 1051మందికి కరోనా సోకగా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన 9మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 10,894మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 11,101మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గడిచిన 24 గంటల్లో 27,643మందికి కరోనా పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 10,77,733 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
1062 New Corona Cases Reported in AP