Sunday, May 5, 2024

బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతున్నారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

BJP Congress leaders speech like as andhra leaders

హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుతోనే తెలంగాణ వెనుకబాటుకు గురైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బిజెపి నేతల నిజస్వరూపం బయటపడిందని, ఇక్కడి నాయకులే తెలంగాణపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెక్షన్-8 అమలు గురించి మాట్లాడడం దారణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలేదని, ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ నిర్మించడానికి తలపెడితే బిజెపి నేతలు ప్రశంసించారని, కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మిస్తే తప్పుపడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ బ్రాండ్ ఇజేజ్‌ను దెబ్బతీసేలా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని, తెలంగాణకు చెందిన బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడు తెలంగాణ కోసం పోరాటం చేయలేదని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కొత్త సచివాలయం తెలంగాణకు ఓ ప్రతీకగా మారబోతోందని, ప్రతిపక్షాలు చౌకబారు వివర్శలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News