Saturday, May 4, 2024

రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Members dead in Rajastan Road Accident

జైపూర్: వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందిన సంఘటన రాజస్థాన్‌లో సోమవారం జరిగింది. చురు జిల్లా భనిపూర్ ప్రాంతంలోని దుంగర్ గఢ్‌లో జీపు-ట్రక్క్ ఢీకొనడంతో ఆరుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు లాలారామ్(60), రేష్మి(65), కనారామ్(40), కళావతి(30), కమ్ల(), సీమాదేవి()గా గుర్తించారు. బిల్వారాలో వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మృత్యువాతపడగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. జహాజ్‌పూర్‌లో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా గౌశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News