న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,881 కొత్త కోవిడ్-19 కేసులు, 334 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 66,946కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 12,237మందిని కోవిడ్ కబలించింది. ప్రస్తుతం భారత్ లో లక్షా 60,384 యాక్టివ్ కేసులు ఉండగా… 1,94,325 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఎపిలో ఇప్పటివరకు 5,555 కేసులుండగా… 90మంది మరణించారు. తెలంగాణలో మొత్తం 5,675 కేసులు నమోదు కాగా… 192మంది కరోనాతో చనిపోయారు. అటు మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు లక్షా 16,752మందికి కరోనా సోకగా.. 5,651మంది కోవిడ్ తో ప్రాణాలు విడిచారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
12881 new covid 19 cases and 334 deaths in india