Friday, April 26, 2024

రాష్ట్రంలో మరో 129 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

129 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 129 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 161 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,96,802 మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలో కరోనాతో 1,619 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,93,540 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1,643 కరోనా యాక్టివ్ కేసున్నాయి. హోం ఐసోలేషన్ లో 637 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 23 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

129 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News