- Advertisement -
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో ఇనుప గనిలో చిక్కుకుపోయిన 13 మంది కార్మికులు మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన డైక్జియన్ కౌంటీలోని డహోంగ్కై ఇనుప గని కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చనిపోయిన 13 మంది కార్మికుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. 1,084 మందితో కూడిన సహాయక బృందం ఆరు రోజుల పాటు పగలూరాత్రీ శ్రమించి గనిలో మరణించిన కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తుచేస్తున్న పోలీసులు 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
- Advertisement -