Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 1398 పాజిటివ్‌ కేసులు.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

17407 New Corona Cases Were Registered In India

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 31,260 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1398 కరోనా‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య  శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 9మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,05,946కు చేరింది. ఇప్పటివరకు కారోనాతో 7,234 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 787మంది కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,89,295 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

1398 New Corona Cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News