Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 1555 కరోనా కేసులు.. 13మంది మృతి

- Advertisement -
- Advertisement -

1555 New Corona Cases Reported in AP

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 1555 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ఎపికి చెందిన 1500మందికి, ఇతర రాష్ట్రాల నుంచి ఎపికి వచ్చిన 53మందికి కరోనా పాజిటీవ్ రాగా, విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా సోకిందని తెలిపింది. కరోనాతో మరో 13మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 23,814కు చేరుకుంది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 277 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఎపిలో 11,383మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,154మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

1555 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News