Friday, May 3, 2024

ఇంత గొప్పగా ఏ ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదు: తలసాని

- Advertisement -
- Advertisement -

180 Double bedrooms opened in Sanath nagar

 

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడని, ఆడబిడ్డల పెళ్లిళ్లు కూడా చేయిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్‌నగర్‌లోని జివై రెడ్డి కాంపౌండ్‌లో 180 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. తొమ్మిది అంతస్థులుగా ఇండ్ల నిర్మాణం, మూడు లిప్టులు ఆరు దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. లబ్ధిదారుల చేత మంత్రులు గృహ ప్రవేశాలు చేయించారు. ఒకప్పుడు దుర్భరంగా ఉన్న ఇక్కడి ప్రజలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను కట్టించామని, బస్తీ వాసులంతా ఏకతాటిపై నిలిచి జాగ్రత్తగా కాలనీని చూసుకోవాలన్నారు. మంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇంటి పన్ను ఏడాదికి రూ.100 చెల్లిస్తే చాలు అని స్పష్టం చేశారు. జివై రెడ్డి కాంప్లెక్స్‌లో తామే గుడి కట్టిస్తామని, పేదలందరికి ఉచితంగా న్యాయబద్ధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని, ప్రజలందరి సంతోషమే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News