Monday, April 29, 2024

అమ్మమ్మ చనిపోయిందనే బాధతో బాలుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Boy committed suicide in Kukatpally

హైదరాబాద్: అమ్మమ్మ చనిపోవడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అల్ జుబేల్ కాలనీలో మహ్మద్ ఫారూఖ్ అలీకి షేక్ మహ్మద్ అలీ అనే కుమారుడు ఉన్నాడు. షేక్ మహ్మద్ అలీ అమ్మమ్మ షాలెహాబేగం జూన్ 13న చనిపోయింది. షాలెహాబేగం అంత్యక్రియలు జరిగిన అనంతరం ఆమె ఇంటి వద్దే మహ్మద్ షారూఖ్ అలీ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అమ్మమ్మ మరణ వార్తను షేక్ మహ్మద్ జీర్ణించుకోలేకపోయాడు. తల్లిదండ్రులకు ఇంటికి వెళ్తున్నానని చెప్పి మహ్మద్ అలీ అల్‌జుబేల్ కాలనీలో తన ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వెంటనే తండ్రి ఇంటికి తలుపులు తట్టగా ఎంతకు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులను బద్దలుకొట్టాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా కుమారుడు ఉరేసుకొని కనిపించాడు. శ్వాస ఆడుతుండడంతో స్థానికంగా ఉన్న ఆపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ బుధవారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీతాపతిరావు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News