Friday, May 3, 2024

దేశంలో మరో 18,222 మందికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

18222 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24గంటల్లో 9,16,951 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో 18,222 మందికి కరోనా నిర్ధారణ అయింది. 228 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. అదే స‌మ‌యంలో 19,253 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,31,639కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. ఇండియాలో ఇప్పటివరకు 1,00,56,651 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం 2,24,190 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స  తీసుకుంటున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కాగా, ఇండియాలో నిన్నటి వరకు మొత్తం 18,02,53,315 మందికి కోవిడ్-19 పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

18222 New Covid-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News