Sunday, April 28, 2024

రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

189 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 189 పాజిటివ్‌లు
జిహెచ్‌ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల 11 వేల 810 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల ఏడు వేల 195 మందికి టెస్టులు చేశామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం 29,449 మందికి టెస్టులు చేయగా 189 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 38 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 2, భద్రాద్రి 8, జగిత్యాల 7, జనగాం 4, భూపాలపల్లి 5, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 8,ఖమ్మం 8, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 7, మహబూబాబాద్ 2, మంచిర్యాల 8, మెదక్ 3, మేడ్చల్ మల్కాజ్‌గిరి 11, ములుగు 3, నాగర్‌కర్నూల్ 3, నల్గొండ 9, నారాయణపేట్ 0, నిర్మల్ 4, నిజామాబాద్ 5, పెద్దపల్లి 7, సిరిసిల్లా 3, రంగారెడ్డి 12, సంగారెడ్డి 3, సిద్ధిపేట్ 4, సూర్యాపేట్ 4, వికారాబాద్ 2, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ లో 9, యాదాద్రిలో మరో ముగ్గురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

అంతేగాక వైరస్ దాడిలో మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,93,590కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,88,926కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రెండు లక్షల మందికి సింప్టమ్స్ లేవు…

రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో సుమారు 2,05,513 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ సోకగా, మరో 88,077 మందికి సింప్టమ్స్‌తో పాజిటివ్ తేలినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేట్ 98.35 శాతానికి పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

189 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News