Wednesday, May 1, 2024

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,987 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 3.39 కోట్లకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 4.60 లక్షలకు పైగా బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 22,844 మంది కోలుకున్నారు.దాంతో ఇప్పవరకు కోలుకుని డిశ్చార్జ్ అయ్యినవారి సంఖ్య 3.32 కోట్లకు చేరుకుంది.ప్రస్తుతం దేశంలో 2.06 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  దేశంలో మొత్తం 96.82 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తుండడంతో మహమ్మారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

18987 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News