Saturday, April 27, 2024

రాజమండ్రి పరిసరాల్లో ‘1920 భీమునిపట్నం’

- Advertisement -
- Advertisement -

కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం‘. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను రాజమండ్రి పరిసరాల్లో జరుపుకుంటోంది. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ను ముగించుకున్న ఈ చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్లి అక్కడి పరిసరాల్లో హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ“‘రాజమండ్రిలో పది రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. హీరో హీరోయిన్లపై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీయడం జరుగుతోంది. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు”అని అన్నారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ “భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News