Monday, April 29, 2024

2.94 లక్షలు దాటిన కోవిడ్ టెస్టులు

- Advertisement -
- Advertisement -

197 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 197 మందికి వైరస్
జిహెచ్‌ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 159 మందికి వైరస్
2,94,120 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.94 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,94,120 మందికి పాజిటివ్ తేలినట్లు ఆరోగ్యశాఖ అధికారులు నివేదించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన చికిత్సతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2,89,987 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా 197 మందికి వైరస్ సోకినట్లు అధికారులు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 38 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 3, భద్రాద్రి 6, జగిత్యాల 8, జనగాం 1, భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 12,ఖమ్మం 7 , ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 3, మంచిర్యాల 9, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 11, ములుగు 2, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 8, నారాయణపేట్ 0, నిర్మల్ 1, నిజామాబాద్ 8, పెద్దపల్లి 7, సిరిసిల్లా 8, రంగారెడ్డి 13, సంగారెడ్డి 8, సిద్ధిపేట 5, సూర్యాపేట్ 4, వికారాబాద్ 2, వనపర్తి 2, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ లో 7, యాదాద్రిలో మరో నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక వైరస్ దాడిలో మరోకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,94,120కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,89,987కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

1600లకు చేరువలో కరోనా మరణాలు…

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1600లకు చేరువయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1596 మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతోనే డెత్ రేట్ కేవలం 0.54 శాతం మాత్రమే రికార్డు అవుతోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచామని వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 77 లక్షల 90 వేల 901 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

అంటే ప్రతి పది లక్షల్లో 2,09,901 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ప్రతి రోజు 44 శాతం ప్రైమరీ, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు ప్రతి రోజు చేసే టెస్టుల్లో 97 శాతం ప్రభుత్వ కేంద్రాల్లో కేవలం 3 శాతం మాత్రమే ప్రైవేట్ సెంటర్లలో టెస్టులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామని ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేగాక మన రాష్ట్రంలో ప్రతి వందలో సుమారు 98 మంది సులువుగా కోలుకుంటున్నారని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News