- Advertisement -
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మార్కాపురం మండలంలోని మిట్టమీదిపల్లి వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను మార్కాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2 Died in Road Accident in Prakasam District
- Advertisement -