Saturday, September 21, 2024

ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

 Srinagar encounter

 

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు సంయుక్త‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని భధ్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతోపాటు కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడి కొడుకు కూడా మృతి చెందాడు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించగా.. ఒక పోలీస్ అధికారి, ఓ జవానుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

2 Hizbul terrorists killed in Srinagar encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News