Monday, May 6, 2024

బాలిక కంటిలో యాసిడ్ పోసిన ఇద్దరు 

- Advertisement -
- Advertisement -

acid in girl eyes
భోపాల్: తమ కుటుంబానికి చెందిన వనిత ఓ యువకుడితో లేచిపోవడానికి తోడ్పడిన యువతి కంటిలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ బాలిక పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆమె చూపేమి పోలేదని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధితురాలు పన్నా జిల్లాలోని బార్హో గ్రామానికి చెందిన నివాసి.
తన పొరుగువారైన సమర్ సింగ్, గోల్డి తన ఇంటికొచ్చి తనతో మాట్లాడాలన్నారని, ఆ తర్వాత తాను తన సోదరుడితో వెళ్లిపోయానని ఆమె తెలిపింది. కాగా వారు తనను, తన సోదరుడిని అనుసరించి చివరికి తమను వారి ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లారని తెలిపింది. నిందితులు తనను వేధించారని, క్రూరంగా తన సోదరుడిని కొట్టారని, తన కంటిలో యాసిడ్ పోశారని ఆమె తెలిపింది. తాను బాధతో అరుస్తుంటే వారు తన కళ్లను ఇంకా రుద్దారని కూడా ఆమె వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News